నమస్తే హైదరాబాద్ (పాలకుర్తి ప్రతినిధి):
భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో 1960 తర్వాత, ఒకే పార్టీకి మూడుసార్లు పట్టం కట్టడం ఇదే తొలిసారి ,ఐదు సంవత్సరాలు వార్డు మెంబర్ చేస్తేనే గప్పాలు కొట్టే గొప్ప నాయకులు ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో, జీవితంలో ఏనాడూ ప్రతిపక్ష పార్టీగా ఉండని గొప్ప పాలన దార్షానికుడు నరేంద్ర మోడీ, ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు ఇంత అఖండ మెజార్టీ ఇచ్చిన దేశ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు, తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపికి సొంతంగా 8 పార్లమెంట్ స్థానాలు సాధించడం చారిత్రాత్మకమైనది…
వారందరికీ హార్దిక శుభాకాంక్షలు.ఒకప్పుడు పట్టణంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీ, నేడు పాలకుర్తి పట్టణం, గ్రామాలలో అశేషమైన ఓటు బ్యాంకును సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెమటలు పట్టించింది, దీనంతటికీ ప్రధాన కారణం బూత్ స్థాయిలో జెండా మోసిన కార్యకర్తలు, అన్నం తిన్న, అటుకులు బుక్కిన, అహర్నిశలు కాషాయపు జెండా కోసం, పని చేసిన ప్రతి కార్యకర్త సోదరునికి సోదరికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతిమ ఫలితం ఏదైనా ఉండొచ్చు, ఎన్నికల కార్య క్షేత్రంలో మన పోరాటం భవిష్యత్తు విజయానికి బాటలు, ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 ఓటర్లతో సమానమని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిరూపించారు, నాయకులు , కార్యకర్తల శ్రమ త్వరలోనే తీరనున్నది, రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో, బిజెపి సంచలనాత్మక విజయాలు నమోదు చేయబోతుంది . పాలకుర్తి గడ్డ పై కాషాయపు జెండా ఎగిరే రోజు అతి తొందరలోనే ఉంది జైహింద్, భారత్ మాతాకీ జై..అని అన్నారు.