Medical students | రామంతాపూర్ ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషర్ణు విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.
గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కాగా, ప్రభుత్వ దవాఖానలో(Medical students) స్లాబు పై పెచ్చులు ఊడి పోయి(Roof collapsed) ఇద్దరు గాయపడ్డారు( Injured). ఈ విషాదకర సంఘటన రామాంతపూర్లోని డీకే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో(Homeopathic hospital) చోటు చేసుకుంది. మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా, మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలయ్యాయి.