నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు,సీపీఐ రాష్ట్ర,జిల్లా నాయకులు
నమస్తే హైదరాబాద్ హనుమకొండ ప్రతినిధి
హనుమకొండ : సీపీఐ సీనియర్ నాయకులు, కార్మిక నేత బీఆర్ భగవాన్ దాస్ 94వ జయంతి వేడుకలు శనివారం హనుమకొండ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అశోక జంక్షన్ లోని భగవాన్ దాస్ విగ్రహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషను ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ నగరానికి నేడు త్రాగు నీరు వచ్చాయంటే కామ్రేడ్ బిఆర్ భగవాన్ దాస్ యొక్క పోరాటాల ఫలితమేనని అన్నారు. పేద ప్రజల సమస్యల పైన అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ అని తెలిపారు. అనుక్షణం పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప మహనీయుడ అన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, కాకతీయ కెనాల్ ద్వారా వరంగల్ పట్టణానికి త్రాగు నీరు అందించడం తాను నమ్మిన సిద్ధాంతల కోసం చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్న వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ అని, అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తాను చిన్ననాటనే భగవాన్ దాస్ మాటలకు ఆకర్షితుడినై, ఆయనను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగానని అన్నారు. ఆయన ఆశయాలను ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ తాము బీఆర్ భగవాన్ దాస్ రాజకీయ వారసులుగా ఆయన కోరుకున్న సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని, ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్,రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఆదరి శ్రీనివాస్, డాక్టర్ బి. రాజ్ సిద్దార్థ,బీఆర్ అంబేద్కర్, జర్నలిస్ట్ యూనియన్ బిఆర్ లెనిన్,తోట సుధాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు,కార్యదర్శి బొల్లారపు సదయ్య, మాజీ కార్పొరేటర్లు టి. విద్యాసాగర్,వీరగంటి రవీందర్,జోరిక రమేష్, సీపీఐ నాయకులు బుస్సా రవీందర్, ఎన్. రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.