తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి ఫల్గుణ, టీఓఏ కోశాధికారి మహేశ్వర్తో పాటు పలు క్రీడా సంఘాలు ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. ఒలింపిక్ సంఘం ఓటర్ల జాబితా కూర్పులో జరిగిన అక్రమాలు, నిధుల దుర్వినియోగంతో పాటు పలు అంశాలపై పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరగాల్సి ఉండడంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న జరగాల్సిన ఎన్నికలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.