Modi 3.0 : రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు.
మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర మంత్రులుగా వరుసగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.
బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలివచ్చారు.