Narendra Modi | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులను ఆహ్వానించారు.
మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్ సభ్య దేశాల ప్రతినిధులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా , శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్, సీషెల్స్ దేశాధినేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నటులు షారుక్ ఖాన్, రజినీకాంత్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు.. ఢిల్లీని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.