– కర్ణాటక 5వ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ డా. సి. నారాయణ స్వామి.
మేడిపల్లి (నమస్తే హైదరాబాద్): పట్టణ స్థానిక సంస్థలు (ULBలు) మరియు పంచాయత్ రాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్ష, విభజన మరియు వనరుల కేటాయింపుపై ఏర్పాటు చేసిన కర్ణాటక 5వ ఫైనాన్స్ కమీషన్ బృందం సభ్యులు ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించారు. వీరికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ త్రిళేశ్వర్ రావు పూలమోక్కను అందజేసి స్వాగతం పలికి అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా పీర్జాదిగూడలో సమీకృత వైకుంఠదామం,మినీ ట్యాంక్ బండ్, సమీకృత వ్యర్థ పదార్థాల శుద్దీకరణ పార్కు, ఎఫ్ఎసీపీ, సెట్విన్ సెంటర్, ఎనిమల్ భర్త్ కంట్రోల్ సెంటర్, బస్తీ దావాఖాన తడి, పొడి చెత్త వేరు చేస్తున్న పద్దతులను వివరించారు.
అభివృద్ధిలో దేశంలో ని అత్యన్నత స్థాయి నగరాలతో పీర్జాదిగూడ పోటీ పడుతుందని కర్ణాటక 5వ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ డా. సి. నారాయణ స్వామి కితాబు ఇచ్చారు.అనంతరం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చాయ చిత్రాలతో కూడిన కాఫీ టేబుల్ బుక్ ను సభ్యులకు అందజేశారు. కర్ణాటక 5వ ఆర్ధిక సంగం కేంద్రం ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సుల ప్రతిని మేయర్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు మొహమ్మద్ సనాహుల్లా IAS, (రిటైర్డ్) , R.S ఫోండే, కంట్రోలర్ (రిటైర్డ్) స్టేట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, వాహబ్ ఖాన్, EM OSD, TS జాయింట్ సెక్రటరీ శర్మ, ఆర్ఓ శ్రీనివాస్రెడ్డి, AE బిక్షపతి,JAO కె. సుమలత,టీపీఓ షేక్ అలీ పాషా, ITC చీఫ్ మేనేజర్ ఉమాకాంత్, MARI ప్రొజెక్ట్ మేనేజర్ సుధా పోలేని తదితరులు పాల్గొన్నారు.