దేవరుప్పుల (నమస్తే హైదరాబాద్)దేవరుప్పుల మండలంలోని రాంబోజి గూడెం గ్రామానికి చెందిన గైని సోమయ్య /సన్నాఫ్ కొండయ్య గురువారం సాయంత్రం నాలుగు గంటలకు తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో ఉరుములు మెరుపులు చూసి దిగే సమయంలో పక్కన ఉన్న తాటి చెట్టు మీద పిడుగు పడటంతో చెట్టు కాలి కరెంట్ షాట్ లెక్క రావడంతో కిందపడ్డాడు . లెఫ్ట్ కాలు విరిగింది మోకాలుకు మోచేయులకు ముఖానికి నడుముకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను 108 అంబులెన్స్ లో జనగాం జిల్లా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు . విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు తన నాయకులతో ఏరియా ఆసుపత్రికి వెళ్లి కొండయ్యను పరామర్శించారు. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.