బీజింగ్: చైనాలో మీటూ ఉద్యమం చేపట్టిన ప్రఖ్యాత మహిళా జర్నలిస్టుకు అయిదేళ్ల జైలుశిక్ష పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన ఘటనలో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం రోజున తీర్పును వెలువరించారు. సోఫియా హువాంగ్ జీకిన్ అనే జర్నలిస్టును కోర్టు దోషిగా తేల్చింది. పది నెలల క్రితం ఈ కేసులో విచారణ జరగ్గా, ఇప్పుడు తీర్పును ఇచ్చారు. సోఫియాతో పాటు మరో కార్యకర్త వాంగ్ జియాన్బింగ్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. లైంగిక వేధింపుల బాధితుల గురించి రిపోర్టింగ్ చేస్తూ 36 ఏళ్ల హువాంగ్ చైనాలో మీ టూ ఉద్యమాన్ని కొనసాగించారు. చైనా మీడియాల్లో జరుగుతున్న వేధింపుల గురించి కూడా ఆమె ధైర్యంగా మాట్లాడేది. మీటూ ఉద్యమం పట్ల ఆగ్రహంతో ఉన్న చైనా అధికారులు ఆమెను 2021లో అరెస్టు చేశారు. దాదాపు వెయ్యి రోజుల పాటు కస్టడీలో ఉన్నారు. సెప్టెంబర్ 2023లో ఆ ఇద్దరిపై కోర్టు విచారణ మొదలైంది. బ్లాక్ జెళ్లుగా పిలువబడే రహస్య ప్రదేశాల్లో వాళ్లు బంధీ చేశారు