స్టార్ ఫిట్నెస్ జిమ్ను ప్రారం భించిన ఈటల …
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి(నమస్తే హైదరాబాద్):
సంపూర్ణ ఆరోగ్యంగా ఉండలంటే నిత్యం వ్యాయామం చేయడం వల్ల అధి సాధ్యమవుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ లోని బుద్ధానగర్లో ఆదివారం స్టార్ ఫిట్నెస్ జిమ్ను ప్రారం భించిన ఆయన ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ సమయాన్ని గడుపుతూ వ్యాయామం చేయడం నిర్లక్ష్యం చేస్తున్నారని దీనివల్ల శారీరక రుగ్మతలకు దారితీస్తోందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఏనా డో చెప్పారని, ప్రతి ఒక్కరూ దానిని పాటించాలని సూచిం చారు. పీర్జాదిగూడలో స్టార్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేయ డాన్ని ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్ర మంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, కౌడె పోచయ్య, సింగిరెడ్డి పద్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ స్టార్ జిమ్ యజమాని జావేద్ శాలువాలతో సత్కరించారు.