నమస్తే హైదరాబాద్, శేరిలింగంపల్లి న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నవోదయ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు శనివారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,జలమండలి అధికారులతో కలిసి కాలనీ వాసులుతో సమావేశమయ్యారు.ఈ సందర్బంగా ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా తమ కాలనీలో గత కొన్ని ఏళ్లుగా ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్య చర్యలు తీసుకోవాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లను కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో చర్చించారు. డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పాటుచేసి, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, అందుకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చేయించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, మరియువిద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేశారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా దృశ్య భూగర్భ డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.ఇప్పటికే డివిజన్ పరిధిలో అనేక సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏ సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ విశాలాక్షి, జలమండలి మేనేజర్ అభిషేక్ రెడ్డి, నవోదయ కాలని వాసులు,సీనియర్ నాయకులు స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.