నమస్తే హైదరాబాద్, శేరిలింగంపల్లి న్యూస్ : ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.శనివారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో స్థానిక కాలనీ సభ్యులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని ,పరిధిలోని ప్రతి కాలనీ,బస్తీలో అభివృధి పనులను సంబంధిత అధికారులతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, విష్ణు, బాలకృష్ణ,శ్రీనివాస్ గౌడ్,పృథ్వి,విజయ్ కుమార్,రవి చందర్,కృష్ణ రెడ్డి,సతీష్, రమణారెడ్డి, రంగారావు,మున్న,మోహన్,సుమన్,నియోజకవర్గ యువ యల ఉదయ్ కిరణ్,వెంకటేష్ యాదవ్,సాయి యాదవ్,షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు