నమస్తే హైదరాబాద్ తుంగతుర్తి ప్రతినిధి జూన్ 6:
తుంగతుర్తి మండల పరిధిలోని గుడి తండ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాజతండ ప్రధానోపాధ్యాయులు గోసుల వెంకన్న ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు,స్వయం సహాయక గ్రూప్ సభ్యులతో, విద్యార్థుల తల్లితల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం గ్రామ సమాఖ్య వారితో బడిబాట కార్యాచరణ పై సమావేశం నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లకావత్ బిచిలి, అంగన్వాడి టీచర్ గుగులోతు రజిత, గ్రామ సమాఖ్య సహాయకులు గుగులోతు నర్సింగ్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్వయం సహాయక గ్రూపు సభ్యులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.