పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులు కళ్లు చెదిరిపోయే రేటుకి అమ్ముడుపోయినట్లు టాక్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’ షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఇన్నాళ్లూ ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం, పవన్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో మరోసారి ఓజీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి ముందు ప్రకటించినట్లుగా సెప్టెంబర్లో సినిమాను రిలీజ్ చేయాలని డైరెక్ట్ సుజీత్ అనుకుంటున్నాడు. తాజాగా ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కళ్లు చెదిరే రేటుకి
ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.92 కోట్లకి కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే పవన్ సినిమాల్లో ఇదే అత్యధికం కావచ్చు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్కి నెట్ఫ్లిక్స్ 2025 స్లాట్ను కేటాయించిందట. దీన్ని బట్టి ఓజీ థియేట్రికల్ రిలీజ్ వాయిదా పడినట్లేనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో థియేటర్లో సినిమా రిలీజైన నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో ఓజీ సెప్టెంబర్ 2024లో థియేటర్లలో రిలీజైతే ఏడాది వరకూ ఓటీటీ రిలీజ్ కోసం ఎందుకు ఎదురుచూస్తుందనేదే ప్రశ్న. కాబట్టి ఓజీ వాయిదా పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు
ఇక షూటింగ్ విషయానికొస్తే కొన్ని పవన్ కళ్యాణ్ పోర్షన్లు మినహా మిగిలినదంతా కంప్లీట్ అయింది. మరి ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో పవన్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారో చూడాలి. ఓజీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది. ఎస్ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.