Pawan Kalyan | పవన్‌ కల్యాణ్‌ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్‌.. జనసేనానిని ఆకాశానికెత్తిన మోదీ

Pawan Kalyan | జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రదాని మోదీ ప్రశంసలు కురిపించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే పవనం కాదు.. ఓ తుఫాన్‌ అని ఆకాశానికి ఎత్తారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించిందని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి పవన్‌ కల్యాణ్‌ చారిత్రాత్మక విజయం సాధించారని మోదీ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని చెప్పారు. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షల ప్రతిరూపమని మోదీ అన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వచ్చాయని.. అంతే త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శించారు. తమిళనాడులో కూటమికి సీట్లు రాకపోవచ్చు కానీ మున్ముందు ఏం జరగబోతుందో తెలుస్తుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles