Lok Sabha Congress Floor Leader: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఆ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్గా(Lok Sabha Floor Leader) బాధ్యతలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో(CWC Meeting) ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) తెలిపారు. శనివారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయ్యింది. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు.
సిడబ్ల్యూసీ సమావేశంలో లోక్సభ ఎన్నికలపై, ఎన్నికల ఫలితాలపై చర్చించామన్నారు. సీబీఐ, ఈడీ సంస్థలతో కాంగ్రెస్ నేతలను బ్లాక్మెయిల్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. కాంగ్రెస్ పని అయిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారని.. ఎగ్జిట్ పోల్స్పై పోరాటం చేశామని కేసీ వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.