హైదరాబాద్: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.