నమస్తే హైద్రాబాద్ సూర్యపేట:*
సూర్యపేట శాసన సభ్యులుగా ముచ్చటగా మూడు సార్లు గెలుపొంది.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,, మాజీమంత్రి గుంటకండ్లజగదీష్ రెడ్డి అభిమానులు సూర్యపేట నుండి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. తాము అనుకున్న కల సాకా రవ్వడంతో మొక్కులు చెల్లించు కునేందుకు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి సన్నిధికి గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన యాదాద్రికి బయలుదేరారు.
పాదయాత్రగా తరలివెళ్లిన వారిలో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదేశ్ రెడ్డి అభిమానులు యలక హరీష్ రెడ్డి, తిప్పని సుదీర్ రెడ్డి, యరకల కౌశిక్ రెడ్డి, సందీప్ రెడ్డి, నవీన్ రెడ్డి, జాన్ రెడ్డి, స్టాలిన్, శ్రీను, పృద్వి, వేణు లతో పాటు మద్దికుంట్ల చింటూ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.