దేవరుప్పుల (నమస్తే హైదరాబాద్) దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామానికి చెందిన గైని సోమయ్య S/0 కొండయ్య రోజువారీ వృత్తిలో గురువారం రోజున సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకు తాటీ చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో ఉరుములు మెరుపులు చూసి దిగే సమయంలో పక్కన ఉన్న తాడిచెట్టు మీద పిడుగు పడడంతో చెట్టు కాలి వారికి కరెంట్ షాట్ లెక్క రావడంతో కింద పడ్డాడు లెఫ్ట్ కాలు పాదం విరిగింది మోకాలుకు మోచేయులకు ముఖానికి నడుముకు దెబ్బలు తగిలినాయి తోటి గీత కార్మికులు, కుటుంబ సభ్యులు కలిసి జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు విషయం తెలవగానే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య పోయి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నాడు లెఫ్ట్ కాలు విరిగింది మోకాలుకు మోచేయులకు ముఖానికి బలమైన గాయాలు తగిలినయ్ డాక్టర్ సూచించారు. బి .వెంకట మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గైని సోమయ్య కి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు బాగా జరుగుతుండడం వలన ప్రభుత్వం ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మోకులను అందించాలని అలాగే ప్రభుత్వం వారి కుటుంబానికి నెలరోజుల లోపే ఎక్స్ గ్రేషయా అందించాలని కోరుచున్నాము. వారితోపాటు కే జి కే ఎస్. జిల్లా కమిటీ సభ్యులు పరిధిల భాస్కర్ , మండల అధ్యక్షుడు ఉప్పునుంతల అయోధ్య, సోషల్ మీడియా కన్వీనర్ మిట్ట బిక్షపతి ,టి సి ఎస్ అధ్యక్షుడు గుర్రము రామచంద్రయ్య, రాంపల్లి యాదగిరి, వంగ దశరథ, గైని శీను, గైన సోమయ్య, మొలుగూరి నరసయ్య, గైన శ్రీనివాస్ , మొలుగూరి భాస్కర్, ఉప్పునుంతల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు…