నమస్తే హైద్రాబాద్,తిరుమలగిరి
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కోరారు గురువారం నాడు ఆయన తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తన కార్యాలయంలో నిర్వహించిన రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గం లో కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయని వీటిని అధికారులు ఆయా పనులను పరిశీలించి పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ,అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడానికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు భాగస్వాములై సహకరించాలని కోరారు తాను నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి తగు ప్రణాళిక సిద్ధం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు