న్యూఢిల్లీ: చత్తీస్ఘడ్లో ఎన్ఐఏ(NIA Raids) అధికారులు 2.98 లక్షల నగదు సీజ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ పార్టీపై నక్సల్స్ ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఆ కేసుతో లింకున్న ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేసింది. ఆ తనిఖీల్లో నగదుతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ జిల్లాలోని బడేగోబ్రా గ్రామంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు అనుమానితుల ఇండ్లల్లో తనిఖీలు చేశారు. 2.98 లక్షలతో పాటు అనేక మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మెయిన్పుర్-నౌపద డివిజన్కు చెందిన నిషేధిత నక్సల్ గ్యాంగ్తో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నవంబర్ 2023లో జరిగిన దాడిలో ఇండో టిబెటియన్ బెటాలియన్ పోలీసుకు చెందిన 615 బెటాలియన్ హెడ్కానిస్టేబుల్ గాయపడ్డారు. ఫిబ్రవరి 2024లో కేసును దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. దాడికి పాల్పడిన నక్సల్ క్యాడర్లను గుర్తించింది.