ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వరుస సమావేశాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే.. ఇప్పటికే ఒకరిద్దరు కీలక నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు ముహూర్తం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి కూడా వైసీపీని వీడటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంపై ఆరా తీసే పనిలో ఉన్న వైసీపీ పెద్దలకు మరో బిగ్ షాక్ తగిలింది.