లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దేవరుప్పుల ( నమస్తే హైదరాబాద్ ) అభివృద్ధి తన లక్ష్యం అంటూ ముందు అడుగు వేసిన పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ,దేవరుప్పుల మండలంలోని నిర్మల గ్రామంలోని మట్టి రోడ్లను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అనంతరం సీతారాంపురం గ్రామంలోని కామారెడ్డి గూడెం గ్రామంలోని సిసి రోడ్లు సైడ్ కాలువలు. కాటమయ్య గుడికి ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు.దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి గ్రామాలు అభివృద్ధి పనులు బాగు చేసుకుందామని అన్నారు. అర్హులైన వారికి పింఛన్లు ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని అన్నారు, గ్రామాలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో నా దగ్గరికి తీసుకురావాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిఅన్నారు, ఇందిరామ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని కోరారు, ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కొనియాడారు, రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికలలో ప్రతి ఒక్కరు ముందు అడుగు వేసి సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించుకోవాలని అన్నారు, గతంలో బిఆర్ఎస్ పార్టీ పేదవాలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థలలో ఎన్నికలలో కష్టపడి పనిచేద్దామని అన్నారు, ఈ కార్యక్రమంలోని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్, మాజీ సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి పాండు కృష్ణ యాదవ్, ధర్మారెడ్డి, సురేష్ అయ్యగారు, పులిగిల్ల వెంకన్న, బోనగిరి యాకస్వామి, దావేరా అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,తదితరులు కార్యక్రమంలో, పాల్గొన్నారు,