*క్రీడా పాఠశాలకు ఎంపికైన వెంపటి ఎంపీపీఎస్ పాఠశాల ఆణిముత్యాలు*
నమస్తే హైదరాబాద్ తుంగతుర్తి ప్రతినిధి ఆగస్టు 3:
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(షాట్స్)ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్రంలో గల మూడు క్రీడా పాఠశాలల (హకింపేట్, కరీంనగర్, ఆదిలాబాద్) కోసం ఎంపిక పోటీల్లో భాగంగా 2024-2025 సంవత్సరమునకు గాను నాలుగవ తరగతి ప్రవేశానికి జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికలలో.. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటికి చెందిన బద్ది వైష్ణవి-కరీంనగర్ క్రీడాపాఠశాలకు, పుల్లూరు నితిన్ ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు,ఇద్దరురాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. వారిని మా పాఠశాల ఉపాధ్యాయబృందం అభినందించి మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకటరామనర్సమ్మ మాట్లాడుతూ జూన్ నెల28వ తారీఖున జరిగిన సూర్యాపేటజిల్లాస్థాయి ఎంపికలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై, హైదరాబాదులో జూలై 10వ తారీఖున హకీమ్ పేట కేంద్రంగా జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికలలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండు క్రీడాపాఠశాలలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమని, విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యా,క్రీడా రంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాలకుర్తి ఎల్లయ్య,పాలకూరి జ్యోతి,మల్లెపాక రవీందర్,గుండ్ల ఆంజనేయులు, శీలోజ రమాదేవి, అబ్బగాని మంజుల పాల్గొన్నారు.