ఘట్కేసర్ ఆగస్టు 3 (నమస్తే హైదరాబాద్)
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ పురపాలక సంఘం పరిధిలో 03.08.2024 తేదీన ఘట్కేసర్ మునిసిపల్ కార్యాలయములోని మీటింగ్ హాల్ లో శ్రీ ప్రశాంత్ జిఎం, డి ఐ సి(స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం) (స్పెషల్ ఆఫీసర్) మరియు చైర్-పర్సన్ శ్రీమతి ముల్లి పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన ఆగస్ట్ 5వ తేది నుండి ఆగస్ట్ 9 వ తేది వరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం గురించి మున్సిపల్ కోన్సిలర్లతో, వార్డ్ అధికారులతో మరియు ఆర్ పి లతో సమావేశం నిర్వహించడం జరిగింది.
సమావేశంలో ఆగస్ట్ 5వ తేది నుండి ఆగస్ట్ 9వ తేది వరకు స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం గురించి వివరించనైనది. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలలో మొక్కలు నాటడం. మునిసిపల్ ప్రాంతాల్లోని పార్కుల శుభ్రత మరియు నిర్వహణ గురించి. వీధి కుక్కల బెడద పై ప్రచారం నిర్వహించాలని. ఇంటి స్థాయిలో చెత్తను వేరు చేయడం పై దృష్టి సారించాలిని. అన్ని ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లు, పిహెచ్ సి, బస్టాప్లు మొదలైన వాటి శుభ్రత గురించి. అన్ని తాగునీటి వనరులను (ఈ ఎల్ ఎస్ ఆర్, జి ఎల్ ఎస్ ఆర్) శుభ్రం చేయాలిని. ప్రతిరోజూ క్లోరినేషన్ చేయాలిని. దోమల వృద్ధిని నిరోధించడానికి ఆయిల్ బాల్స్ తగినంత సంఖ్యలో తయారు చేసి, నిలిచి ఉన్న నీటి కొలనులలో వదలాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ యం.డి సాబేర్ అలీ, 1వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ సి.ఎచ్ వెంకట్ రెడ్డి, 3వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి బొక్క సంగీత, 4వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ బండారి ఆంజనేయులు గౌడ్, 10 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శశికళ దేవేందర్,మేనేజర్ శ్రీ ఎన్. వెంకట్ రెడ్డి గారు, వార్డ్ అధికారులతో మరియు ఆర్ పి లు పాల్గొన్నారు.