నాగారం నమస్తే హైదరాబాద్ :*(ఆగష్టు 3)
నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామపంచాయతీ లో ఇటీవల బుర్రి బుచ్చిరెడ్డి మరణించడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని అంబయ్య, కూరం వెంకన్న, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కన్నెబోయిన మల్లేష్, పెసర సోమిరెడ్డి,వేణుగోపాల్ రెడ్డి, కుమార్ సోమలింగం,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.