ఎమ్మెల్సీని సన్మానించిన టీం సభ్యులు
నమస్తే హైదరాబాద్ (పాలకుర్తి ప్రతినిధి):
ఎమ్మెల్సీగా గెలుపొందిన తీన్మార్ మల్లన్న మొట్టమొదటి సారిగా పాలకుర్తికి వచ్చిన సందర్బంగా వారిని శాలువాతో సన్మానించి, మండలంలో పలు సమస్యల చర్చించిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు. పాలకుర్తి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని, 100 పడకల ఆసుపత్రి వాటి గురించి శాసనమండలిలో ప్రస్తావించాలని, తీన్మార్ మల్లన్న టీం జిల్లా కో కన్వీనర్ కసోజు బ్రహ్మచారి, నియోజకవర్గ ఇన్చార్జి గాడిపెళ్లి యాకన్న ,రిపోర్టర్ వేర్పుల మహేష్ , చెడుపాక.సందీప్, కొమ్ము.నరేష్ తదితరులు తీన్మార్ మల్లన్నకు వినతి పత్రాన్ని అందజేశారు.