నాగారం నమస్తే హైదరాబాద్:
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నాగారం నుండి తుంగతుర్తి కి వెళ్లే ప్రధాన రహదారిపై పస్తాల క్రాస్ రోడ్ పసునూరు స్టేజిల మధ్యలో చెట్టు రోడ్డు పై కూలి సగానికంటే ఎక్కువ ఆక్రమించడం వలన ఆధమరిస్తే ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ప్రతిరోజు పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న చెట్టుని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.